కామెడీ మూవీస్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది జాతిరత్నాలు సినిమా. లాక్ డౌన్ పీక్ టైమ్ లో రిలీజైన ఈ సినినిమా కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ఈ మూవీలో తెరవెనుక దర్శకుడిగా అనుదీప్ కేవీ చూపించిన టాలెంట్ తో పాటు తెరపై హీరో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోందని సమాచారం. నవీన్ పోలిశెట్టి, అనుదీప్ కేవీ కలిసి కొత్త సినిమా చేస్తున్నారు.

నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ గతంలో అనౌన్స్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా డైరెక్షన్ బాధ్యతలు అనుదీప్ కేవీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మ్యాడ్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ చేయాల్సిఉండగా..ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు కల్యాణ్ శంకర్ రైటర్ గా మాత్రమే ఉంటూ డైరెక్షన్ అనుదీప్ కు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో జాతిరత్నాలు కాంబో మళ్లీ స్క్రీన్ మీద ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది.

నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో రీసెంట్ హిట్ కొట్టగా..జాతిరత్నాలు తర్వాత శివకార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ తెరకెక్కించారు అనుదీప్ కేవీ. అనుదీప్ స్టైల్ ఆఫ్ కామెడీ అటు తమిళ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ సినిమా తమిళ కాస్టింగ్ తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. నవీన్ సినిమాతో అనుదీప్ మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోబోతున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *