పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో మన డార్లింగ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అభిమానులు తెగ హైరానా పడిపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో `ఆదిపురుష్` చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కాబోతోంది.
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`(salaar), నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్-కె` చిత్రాలను పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు పూర్తి కాకముందే మారుతితో ఓ మూవీని ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.
కానీ, షూటింగ్ మాత్రం చకచకా జరిగిపోతోంది. ఈ మూవీకి `రాజా డీలక్స్`(raja deluxe) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, ప్రాజెక్ట్-కెతో పాటు మారుతి సినిమాను కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇవి కంప్లీట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` అనే మూవీని ప్రారంభించాల్సి ఉంది. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో మన డార్లింగ్ ఆరోగ్యానికి గురయ్యాడట. దీంతో ప్రభాస్ ఇంటి పట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్స్(movie shootings) తాత్కాలికంగా ఆగిపోయినట్లు సమాచారం. ఇకపోతే అభిమానులు కంగారు పడాల్సిన అవసం లేదని, ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం కాస్త బాగానే ఉందని, జ్వరం నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.