గత ఏడాది `యశోద` మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. ఈ నెలలో `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం(Shaakuntalam) ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మేనక, విశ్వామిత్రకు శకుంతల జన్మించిందనే విషయం నుంచి మొదలుపెట్టి, ఆమె దుష్యంతుడ్ని కలవడం, ప్రేమలో పడటం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని ఎంతో సుందరంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఇందులో శకుంతలగా సమంత(Samantha), దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, అల్లు అర్హ, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలను పోసించారు. గత ఏడాదే శాకుంతలం విడుదల కావాల్సి ఉన్నా.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.
అయితే విడుదలకు ఇంకా కొద్ది రోజులే ఉన్నా ప్రమోషన్స్ ఊపందుకోకపోవడంతో శాకుంతలం విడుదల(shaakuntalam release) మళ్లీ వాయిదా పడబోతోందని పెద్ద ఎద్దున ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది కూడా. అవును, శాకుంతలం విడుదల వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. కారణం తెలిపకపోయినా.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనే ఆనందంతో ఉన్న అభిమానులకు నిరాశను కలిగించే వార్తనే ఇది. ఈ నేపథ్యంలోనే గుర్రుగా ఉన్న సామ్ ఫ్యాన్స్ శాకుంతలం మేకర్స్ ను సోషల్ మీడియా ద్వారా ఏకేస్తున్నారు. కాగా, గుణశేఖర్(gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆయన కూతురు నీలిమ గుణ `గుణ టీమ్ వర్క్స్` బ్యానర్పై నిర్మించింది. ప్రముఖ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరించారు. మణిశర్మ స్వరాలు అందించాడు.