UnstoppableUnstoppable.. నటసింహ బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా ఆయన ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్లో భాగంగా చాలామంది హీరోలను, హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య వారి నుంచి ఎన్నో విషయాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ మొదటి ఎపిసోడ్ ప్రారంభమైన కొత్తలో బాలయ్య ఈ షో చేయగలడా అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి కానీ అందరి అనుమానాలకు తెరదించుతూ.. బాలయ్య తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.

ఒక హీరో గా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా హోస్ట్ గా తను సత్తా చాటగలనని నిరూపించాడు. అందులో భాగంగానే మొదటి సీజన్ ఊహించని స్థాయిలో భారత దేశంలోనే నెంబర్ వన్ రేంజ్ లో టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకొని సెలబ్రిటీ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సీజన్ 2 ని కూడా మొదలుపెట్టారు. కానీ ఊహించని స్థాయిలో సక్సెస్ కాకపోవడం గమనార్హం. సీజన్ 2 లో పెద్దగా చెప్పుకోవాల్సిన సెలబ్రిటీలు ఎవరు రాలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ , ప్రభాస్ తప్ప అందులోను వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరొకవైపు బాలకృష్ణ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తమ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ గొప్ప గొప్ప వాళ్లను అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడిన కామెంట్ లు అక్కినేని అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు సీజన్ 2 కి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు వస్తారు అని అందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. కనీసం ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం.

కానీ ఇప్పుడు వీరి ముగ్గురు సీజన్ 3 కి వస్తారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. వీరి ముగ్గురి కోసం సీజన్ 3 వరకు ఎదురు చూడలేము అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకరకంగా చెప్పాలి అంటే బాలయ్య సిల్వర్ స్క్రీన్ పై మొదట్లో సక్సెస్ పొందినట్టుగా ఇప్పుడు సక్సెస్ పొందలేకపోతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *