హీరో ఎన్టీఆర్ లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ టిల్లు స్క్వేర్ స్పెషల్ షో చూశారు. ఈ సినిమా సక్సెస్ పట్ల టీమ్ మెంబర్స్ కు తన కంగ్రాట్స్ తెలియజేశారు. ఆ తర్వాత నిర్మాత నాగవంశీ, యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిల్లు స్క్వేర్ లో సిద్ధు పర్ ఫార్మెన్స్ తనకు బాగా నచ్చిందని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నారు. ఈ నెల 8న టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ జరగనుందని టాక్ వినిపిస్తోంది. గత నెల 29న థియేటర్స్ లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే ఈ సినిమా 85 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. వంద కోట్ల రూపాయల మార్క్ వైపు దూసుకెళ్తోంది. ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు దక్కుతున్నాయి. టిల్లు స్క్వేర్ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. టిల్లు 3 సినిమా కూడా అనౌన్స్ చేశారు.