‘‘ టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023’’ . టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సమ్మిట్‌కు హైదరాబాద్‌ వేదికైంది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జూన్ 9, 10, 11 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.

ఇంటర్ , డిగ్రీ తర్వాత కెరీర్‌లను ఎలా ప్లాన్ చేసుకోవాలనే సందిగ్థంలో వున్న విద్యార్ధులకు టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఓ సువర్ణావకాశంగా దోహదపడుతుంది. ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు, యూనివర్సిటీలు పాల్గొనే ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో విద్యార్ధులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, కంప్యూటర్స్, యానిమేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇంకా ఎన్నో రకాల కోర్సులు, ఆయా రంగాల్లో వున్న ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు.

అలాగే విద్యార్ధులు తమకు ఇష్టమైన కెరీర్‌ను ఎంచుకునే విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఎంట్రన్స్ టెస్టులైన ఎంసెట్, నీట్, JOSAA, ECETలకు ఎలా సన్నద్ధం కావాలి, వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుుకోవాలనే దానిపై నిపుణుల నుంచి సూచనలు పొందవచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *