జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రతిష్టాత్మక పాఠశాల మాజీ చైర్మన్ తన ఇంటి పనిమనిషిని వేధింపులకు గురి చేసిన కేసు నమోదైంది. ఈ 55 ఏళ్ల నిందితుడితో పాటు అతని కుమారుడిపై కూడా కేసు కూడా నమోదైంది. జూన్ 18న బంజారాహిల్స్‌లోని నిందితుడి ఇంట్లో గృహ సేవల సంస్థ సదరు మహిళను పనికి వెళ్లగా రెండు వారాల తర్వాత ఆమెను తండ్రి కొడుకులిద్దరూ వేధింపులకు గురిచేశారు. అంతేకాదు ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. ఈ విషయం బయటకి చెబితే ఆమెను చంపేస్తారని కూడా బెదిరించారట.

ఈ విషయంపై గతంలో ఓ సారి పోలీసుల వద్దకు వెళ్లగా అక్కడ ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. అయితే ఈ విషయాన్నీ ఆమెతల్లికి చెప్పగా ఈనెల 18 న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి పంపించారు. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్‌ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్, జూబ్లీహిల్స్‌ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి మురళి ముకుంద్ మరియు అతని కుమారుడు ఆకాష్ ఇంట్లో పనిచేసే యువతిని బెదిరించి లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈమేరకు ఆమె సదరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసుల సహాయంతో కేసు నమోదు చేసింది.

మిథిలానగర్ లో నివసిస్తున్న వీరి ఇంట్లో పనిచేయుటకు ఓ యువతి (22) ఓ ఏజెన్సీ సహాయంతో వారింటికి పనినిమిత్తం వచ్చింది. కొన్ని రోజులకే ఆమెపై తండ్రి కొడుకులు లైంగిక దాడి చేసిన నేపథ్యంలో అప్పుడు ఓ పోలీస్ స్టేషన్ లో రాజీకి కుదిర్చారు. తల్లికి విషయం చెప్పడంతో మళ్ళీ కేసు నమోదు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed