సినీ పరిశ్రమలో ప్రముఖ జ్యోతిష్యుకుడు వేణు స్వామి పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను చెబుతూ వేణు స్వామి ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత(Samantha) విడాకుల తర్వాత వేణు స్వామికి భారీ పాపులారిటీ వచ్చింది. నాగచైతన్య సమంత పెళ్లి సమయంలో వీరిద్దరూ ఎక్కువకాలం కలిసి ఉండరని వేణు స్వామి పేర్కొన్నాడు. నిజంగానే చై, సామ్‌ విడిపోవడంతో వేణు స్వామికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.

చాలా మంది వేణు స్వామి చెప్పిన విషయాలను నమ్ముతుంటారు. మరి కొందరు ఆయన వ్యాఖ్యలను కొట్టి పారేస్తుంటారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్ర‌భాస్‌ పరిస్థితి నెగటివ్ గా ఉందని.. ఆయనకు ఆరోగ్య ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని వేణు స్వామి వెల్లడించాడు. అలాగే ప్రభాస్ కు అర్ధాష్టమ శని ప్రారంభం కానుందని.. దీని కారణంగా ప్రభాస్ ఎంత పెద్ద సినిమా చేసిన రిజల్ట్ నామ మాత్రంగానే ఉంటుందని.. ఆయన సినిమాలు అభిమానులు కోరుకున్నట్లు భారీ హిట్ అవ్వవ‌ని వేణు స్వామి(Venu Swamy) వెల్లడించారు. ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భాస్‌ అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు వేణు స్వామి వ్యాఖ్యలు నిజం అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

కాగా ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్`(salaar) అనే సినిమాను చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్‌- కె`, మారుతీ దర్శకత్వంలో `రాజా డీలక్స్` చిత్రాల‌ను పట్టాలెక్కించాడు.ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఈ మూడు సినిమాలు పూర్తయిన వెంటనే ప్రభాస సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` అనే మూవీని ప్రారంభించనున్నాడు. అలాగే `పఠాన్` డైరెక్టర్ తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ భారీ ప్రాజెక్టును నిర్మించబోతున్నారని టాక్ నడుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *