Akkineni Nagarjuna

అక్కినేని మ‌న్మ‌ధుడు, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున(Nagarjuna) గ‌త ఏడాది `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అస‌లే స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న నాగార్జున‌కు `ది ఘోస్ట్‌` మ‌రింత నిరాశ ప‌రిచింది. ఇక‌పోతే నాగార్జున తన తదుపరి చిత్రాన్ని పాపులర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇటీవ‌ల విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ధమాకా`(Dhamaka)కు ప్రసన్న కుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ ను డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేస్తూ నాగార్జున ఓ సినిమా చేయ‌బోతున్నాడు. నాగార్జున కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 99వ చిత్రం ఇది. ఇప్పటికే ప్రసన్న కుమార్ చెప్పిన కథకు నాగార్జున ఇంప్రెస్ అయ్యాడు. స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయి. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్(Allari Naresh) మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానున్న‌ట్లు తెలిసింది. మార్చి లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కావాలని నాగార్జున పట్టుబట్టాడట. `సీతారామం` మూవీతో మృణాల్ టాలీవుడ్ కు పరిచయమైంది.

హ‌ను రాఘ‌వ‌పూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో దుల్క‌ర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. తొలి సినిమాతోనే మృణాల్ టాలీవుడ్లో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అయితే కథ పరంగా త‌న త‌దుప‌రి సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా బాగా సెట్ అవుతుందని నాగార్జున భావిస్తున్నాడట. దీంతో మేక‌ర్స్ మృణాల్ ను ఒప్పించే పనిలో పడ్డారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజ‌న్లు.. నాగార్జున కావాలా.. కాస్త ఓవర్ కాలేదు అంటూ సరదాగా సెటైర్లు పేలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *