మలయాళ చిత్ర పరిశ్రమలో హయ్యెస్ట్ గ్రాస్డ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఈ నెల 6న తెలుగులో రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇటీవల పలు డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి తీసుకొస్తోందీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. మంజుమ్మల్ బాయ్స్ యువతను ఆకట్టుకునే సినిమా కానుంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే గుణ కేవ్స్ ను చూడటానికి వెళ్లిన మంజుమ్మల్ బాయ్స్ బృందంలో ఒకరు ఆ గుహలో చిక్కుకుపోతారు.

అతన్ని కాపాడేందుకు పోలీసుల హెల్ప్ కోసం వెళ్తే వాళ్లు నమ్మరు. మీరే హత్య చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చారా అని అడుగుతారు. అత్యంత ప్రమాదకరమైన ఆ గుహల్లోకి ఈ బాయ్స్ టీమ్ ఎందుకు వెళ్లింది. చిక్కుకున్న ఆ వ్యక్తి బయటకు వచ్చాడా లేదా అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, అభిరామ్ తదితరులు కీరోల్స్ ప్లే చేశారు. మలయాళ ఇండస్ట్రీలో 200 కోట్ల రూపాయలు వసూళు చేసిందీ సినిమా.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *