హీరోయిన్ త్రిష తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఈ కాంబో సినిమాను ఇటీవలే అనౌన్స్ చేస్తారని అనుకున్నా అది జరగలేదు. అయితే త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా రూపొందించి వెయ్యి కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అట్లీ.

ఈ సినిమా తర్వాత అట్లీ రేంజ్ మారిపోయింది. ఏ స్టార్ అయినా ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబో కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నదే. ప్రస్తుతం త్రిష తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర సినిమాతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కొత్త సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో మళ్లీ బిజీగా మారింది త్రిష.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *