రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్పిరిట్. సందీప్ వంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. యానిమల్ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి సినిమా చేస్తుండటంతో స్పిరిట్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కల్కి ఫినిష్ చేసి రాజా సాబ్ సెట్ లోకి వెళ్లబోతున్నారు.
రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యాక స్పిరిట్ కోసం ప్రభాస్ రెడీ అవుతారని తెలుస్తోంది. ఇదొక పవర్ ఫుల్ పోలీస్ కథ కాబట్టి ఆ క్యారెక్టర్ కోసం ప్రభాస్ మేకోవర్ అవ్వాల్సిఉంటుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ కోసం సెర్చ్ మొదలైంది. ఇప్పుడు వారిలో ప్రభాస్ ఇమేజ్ కు సరిపోయే హీరోయిన్స్ ను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. రశ్మిక మందన్న, కీర్తి సురేష్ లను స్పిరిట్ టీమ్ అప్రోచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరిని ప్రభాస్ కు జోడీగా సెలెక్ట్ చేస్తారట. రశ్మిక, కీర్తి ఎవరు ప్రభాస్ సరసన నటించినా వారి జోడి కొత్తగానే ఉంటుంది.