కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ తన కొత్త సినిమాను ఈ శుక్రవారం అనౌన్స్ చేయబోతున్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత యష్ ప్రకటిస్తున్న కొత్త సినిమా ఇది. యష్ 19గా పిలుస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తోంది.
యష్ 19లో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి పల్లవి పర్పెక్ట్ యాప్ట్ అని అనుకుంటున్నారట. ఆమెకు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో గుర్తింపు ఉంది. దాంతో పాన్ ఇండియా మూవీకి హీరోయిన్ గా సాయి పల్లవి అయితే అడ్వాండేజ్ అని యష్ 19 మేకర్స్ భావిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా యష్ కొత్త సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది.