సినిమా లవర్స్ లో యూత్ ఆడియెన్స్ దే మెజారిటీ. వాళ్లను అట్రాక్ట్ చేసిన యాక్టర్స్ స్టార్స్ అవుతుంటారు. అలా యూత్ ను అట్రాక్ట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాలోని రాధిక క్యారెక్టర్ తో యూత్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది నేహాశెట్టి. వాళ్ల ఎక్స్ ప్రెషన్ కు ఒక సింబల్ గా మారింది రాధిక క్యారెక్టర్. నేహా శెట్టికి వరుసగా ఆఫర్స్ తెచ్చేంతగా సోషల్ మీడియాలో రాధిక ఫేమస్ అయ్యింది. “డీజే టిల్లు” సక్సెస్ ను తన తర్వాత సినిమాలు “బెదురులంక 2012”, “రూల్స్ రంజన్”తో కొనసాగించింది నేహా శెట్టి.

తెలుగులో చేసిన మూడు సినిమాలు వరుసగా హిట్ కావడంతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఎదిగింది. అందుకే గ్లామర్ ఫ్లస్ పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్, డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ తో కలిసి నేహా శెట్టి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఆడియెన్స్ నుంచి దక్కుతున్న ఆదరణ, టాలీవుడ్ తనపై పెట్టుకున్న నమ్మకంతో క్రేజీ లైనప్ చేసుకుంటోంది నేహా శెట్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *