హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ స్వాతి రెడ్డి జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ సత్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే హాలీవుడ్ బీఎల్ వీడీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. సత్య సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికకావడం సంతోషంగా ఉందని తెలిపారు.
కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో ఉండే తెలుగు వారు సత్య సినిమాను హాలీవుడ్ బీఎల్ వీడీ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లి చూడాలని సాయి ధరమ్ తేజ్ కోరారు. ఈ బ్యుటిఫుల్ షార్ట్ ఫిలిం మీకు నచ్చుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. సత్య షార్ట్ ఫిలింతోనే ఈ చిత్రోత్సవాలు ప్రారంభం కావడం విశేషం. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించాడు.