రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించారు. టీ సిరీస్ సంస్థ నిర్మించగా..రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 1న యానిమల్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా లెంగ్త్ భారీగా ఉండటంతో రెండు ఇంటర్వెల్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

3 గంటల 18 నిమిషాల సుదీర్ఘ నిడివితో యానిమల్ సినిమాను రూపొందించారు దర్శకుడు. ఇంత లెంగ్త్ ఉన్న సినిమాకు రెండు ఇంటర్వెల్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. గతంలో కొన్ని హిందీ సూపర్ హిట్ సినిమాలకు ఇలాగే రెండు ఇంటర్వెల్స్ పెట్టారు. లెంగ్త్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. యానిమల్ విషయంలోనూ అదే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇటీవల కాలంలో ఇలా రెండు ఇంటర్వెల్స్ సినిమాలు లేవు. కాబట్టి ఇదో కొత్త ట్రెండ్ అవుతుందని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *