బాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కియారా అద్వానీ వారిలో క్లిక్ కాగా ఇప్పుడు ఆ జాబితాలో అనన్య పాండే కూడా కనిపిస్తుంది. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దాంతో ఇక అనన్య పాండేకి ఇప్పట్లో అవకాశాలు రాకపోవచ్చని భావించారు. కానీ ఈ నాజూకు సుందరి మహేశ్ మూవీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఆల్రెడీ అటు త్రివిక్రమ్ తోను .. ఇటు మహేశ్ బాబుతోను ఆమెకి హిట్స్ ఉన్నాయి. అందువలన అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *