పలు సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్ రాసిన మాటల రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు తమిళనాడులోని తేనాపేట అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శ్రీరామకృష్ణ స్వస్తలం తెనాలి.

చాలాకాలం క్రితమే చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు బార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. బొంబాయి, జెంటిల్మన్,‌ చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేశారు శ్రీ రామకృష్ణ. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. దర్శకులు మణిరత్నం, శంకర్ అన్ని చిత్రాలకు మాటలు రాసిన శ్రీరామకృష్ణ, రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివ దేహానికి రేపు ఉదయం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *