తెలంగాణలో లేదు గానీ ఏపీలో రాజకీయ పార్టీలు ఒకరిని తిడుతూ మరొకరు సినిమాలు తీస్తున్నారు. యాత్ర సినిమాలు, వర్మ తీసిన వ్యూహం, శపథం లాంటి సినిమాలు పొలిటికల్ గా టార్గెట్ చేస్తూ రూపొందించినవే. ఇప్పుడీ క్రమంలో నారా రోహిత్ ప్రతినిధి 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ 2ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ లో రోహిత్ నటిస్తున్నారు.

టీవీ 5 న్యూస్ రీడర్ మూర్తి ప్రతినిధి 2 సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లోని డైలాగ్స్ వైఎస్ఆర్ సీపీని టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి. రాష్ట్ర అప్పుడు 5 కోట్లు ఉందని, అది తీర్చడం ఎప్పటికయ్యే పని అంటూ డైలాగ్స్ ఉన్నాయి, అభివృద్ధా..అదెక్కడుంది అనే డైలాగ్ కూడా అక్కడి ప్రభుత్వాన్ని ఉద్దేశించిందే. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉందీ సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *