సెలబ్రిటీల మైనపు బొమ్మలతో మ్యూజియం నిర్వహిస్తుంటుంది మేడమ్ టుస్సాడ్స్. దీనికి లండన్ తో పాటు దుబాయ్ లోనూ మ్యూజియమ్స్ ఉన్నాయి. దుబాయ్ మ్యూజియమ్ లో ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్, ప్రభాస్ మైనపు బొమ్మలను పెట్టారు. తాజాగా ఈ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరారు. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు బొమ్మను స్వయంగా ఆవిష్కరించారు.

మైనపు బొమ్మతో అల్లు అర్జున్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు ఫ్యాన్స్ ఈ పిక్స్ బాగా పోస్ట్ లు చేస్తున్నారు. ఈ వ్యాక్స్ స్టాచ్యూ ఓపెనింగ్ కోసమే పుష్ప 2 నుంచి బ్రేక్ తీసుకుని దుబాయ్ వెళ్లారు అల్లు అర్జున్. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *