పలు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నటి ప్రశాంతి హారతి. ఆమె కెరీర్ లో పెళ్లాం ఊరెళితే, ఇంద్ర లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. పెళ్లై యూఎస్ వెళ్లాక ప్రశాంతి హారతి సినిమాలకు దూరమైంది. ఇదంతా జరిగి ఇరవై ఏళ్లవుతోంది. ఈ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలనే తన కోరికను వెల్లడించింది ప్రశాంతి హారతి. త్వరలోనే ఓ మంచి క్యారెక్టర్ తో టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలింస్, మూవీస్ ఏవైనా సరే మంచి రోల్ ఉంటే చేస్తానని చెబుతోంది.

ప్రశాంతి హారతి మాట్లాడుతూ – ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత రూపాయి, పెళ్లాం ఊరెళితే, ఇంద్ర సినిమాలతో పాటు హిందీలో పలు సీరియల్స్ చేశాను. మ్యారేజ్ తర్వాత అమెరికా వెళ్లిపోయాను. ఇండస్ట్రీకి నేను దూరమై ఇరవై ఏళ్లు దాటింది. అప్పటి సినిమాకు ఇప్పటి సినిమాలకు చాలా తేడా వచ్చేసింది. ఓటీటీలు వచ్చాయి. మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో నేను ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. నటన మీద నా ప్యాషన్ తగ్గలేదు. అందుకే మళ్లీ సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నా. ప్రతి కథలో కొన్ని క్యారెక్టర్స్ కీలకంగా ఉంటాయి. వాటిని ప్రేక్షకులు బాగా గుర్తుంచుకుంటారు. అలాంటి స్పెషల్ రోల్స్ చేయాలని భావిస్తున్నా. నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తోంది. షూటింగ్ లకు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటా. అని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *