టు పార్ట్ మూవీస్ ఇప్పుడొక ట్రెండ్ గా మారాయి. భారీ పాన్ ఇండియా మూవీస్ దాదాపుగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ ట్రెండ్ ను ఫేమ్ చేసింది కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన కేజీఎఫ్, సలార్ సినిమాలతో టు పార్ట్ మూవీస్ కు క్రేజ్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను కూడా రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 మేకింగ్ కు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ దేవర రెగ్యులర్ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా ఊటీ షెడ్యూల్ జరుపుకుంటోంది.