డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాను జూలైలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా ఇదే. వెంకటేష్ తో గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు రూపొందించారు అనిల్ రావిపూడి.

ఇప్పుడది వీళ్ల కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్ కానుంది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత దిల్ రాజుతోనూ అనిల్ రావిపూడి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాకు భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *