రామ్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మే లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ టైమ్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మూవీ టీమ్ భావిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసినప్పుడు మార్చి 8న రిలీజ్ డేట్ గా ప్రకటించారు. అది కాస్తా మే నెలకు వెళ్లింది.

ఇప్పుడు మే నెలలోనూ రిలీజ్ చేయలేమని, జూన్ లో రిలీజ్ కు వెళ్తే బాగుంటుందని డైరెక్టర్ పూరి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా రిలీజ్ గురించి రీసెంట్ గా హీరో రామ్ స్పందించాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ టైమ్ లో కానందువల్ల మార్చి లో రిలీజ్ సాధ్యం కాలేదని తెలిపాడు. ఈ కాంబో హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ వస్తుండటంతో కొంత క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా డబుల్ ఇస్మార్ట్ రూపొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *