కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన సుందరం మాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. హోమ్ ట్యూషన్స్ స్టార్ట్ ఫ్రమ్ మార్చి 28 అంటూ అనౌన్స్ మెంట్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో వస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే చివరకు ఆహాలోనే ఓటీటీ రిలీజ్ వస్తోంది.

గత నెల 23న సుందరం మాస్టర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. కొత్త కథైనా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోయిందీ సినిమా. ఓ మారుమూల గ్రామానికి ఇంగ్లీష్ పాఠాలు చెప్పేందుకు వెళ్లిన సుందరం మాస్టర్ కు ఎదురైన పరిస్థితులు ఏంటనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమాను ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై హీరో రవితేజ ప్రొడ్యూస్ చేశారు. దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు కల్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆహాలో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఛాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *