పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఒమి బావు అనే పవర్ ఫుల్ విలన్ గా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. గంభీరా నువ్వు ముంబై వస్తున్నావని విన్నా…ఒట్టేసి చెబుతున్నా..మన ఇద్దరిలో ఒకరి తల మాత్రమే మిగిలి ఉంటుంది..అనే డైలాగ్ ను ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ లుక్ రిలీజ్ సందర్భంగా రివీల్ చేశారు.
ఈ డైలాగ్ తో ఒమి బావు క్యారెక్టర్ ఎంత క్రూరంగా ఉంటుందో తెలుస్తోంది. పవర్ ఫుల్ హైనా వర్సెస్ హంగ్రీ చీతా పోరు ఎలా ఉంటుందో ఓజీలో పవన్, ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్స్ మధ్య రైవలరీ అలా ఉంటుందని మూవీ టీమ్ చెబుతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు సుజీత్ ఓజీ సినిమాను రూపొందిస్తున్నారు. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా…ఆ రిలీజ్ డేట్ డిసెంబర్ కు వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.