హీరోగా పాతికేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎగ్జైట్ మెంట్ ఇచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’ నటుడిగా చాలా సంతృప్తినిచ్చిందని సూర్య అంటున్నారు. రీసెంట్ గా ముంబైలో ‘కంగువ’ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు బాబీ డియోల్, దర్శకుడు సూర్య, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, సినిమాటోగ్రాఫర్ వెట్రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ‘కంగువ’ సినిమా గురించి సూర్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ విషయంలో నమ్మకాన్ని వ్యక్తం చేశారు సూర్య. ఇలాంటి గొప్ప సినిమాలో నటించడం గర్వంగా ఉందన్నారు. ‘కంగువ’ టీమ్ మొత్తం కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం పనిచేసినట్లు సూర్య చెప్పారు. ప్రతి రోజూ షూటింగ్ మరింత క్వాలిటీతో చేసుకుంటూ వచ్చామని, నటుడిగా ప్రతి రోజూ తనను ‘కంగువ’ ఎగ్జైట్ మెంట్ కు గురిచేసిందని సూర్య అన్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ప్రేమతో పాటు అవార్డులనూ అందిస్తుందనే ఆశిస్తున్నట్లు సూర్య చెప్పారు. ‘కంగువ’ ఇంత క్వాలిటీగా వచ్చిన క్రెడిట్ మూవీ టీమ్ కు దక్కుతుందన్నారు సూర్య. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *