తమిళ హీరోయిన్ అరుంధతి నాయర్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అరుంధతి నాయర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 2014లో తమిళ సినిమాల్లో అరంగేట్రం చేసిన అరుంధతికి విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సైతాన్ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. సైతాన్ సినిమా తర్వాత హీరోయిన్ గా బిజీ అయ్యింది అరుంధతి. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది.

ఈ నెల 14న ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు తన సోదరుడి బైక్ మీద కోవాలం అనే ఊరు వెళ్లింది అరుంధతి, ఆ ఊరు బైపాస్ రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను త్రివేండ్రం లోని అనంతపురి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి అరుంధతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు వైద్యానికి ఖర్చుల కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *