హీరో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్ స్టాలో 25 మిలియన్ ఫాలోవర్స్ తో తొలి తెలుగు హీరోగానే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సెలబ్రిటీగా మారారు అల్లు అర్జున్. ఆయన 25 మిలియన్ ఫాలోవర్స్ మైల్ స్టోన్ కు రీచ్ అయిన సందర్భాన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్పందిస్తూ మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశాడు.

పుష్ప సినిమా పాన్ ఇండియా సక్సెస్ తర్వత సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ బాగా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు పుష్ప2 సినిమా కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ తో పాటు అల్లు అర్జున్ తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చేసే పోస్టులను వారంతా ఫాలో అవుతున్నారు. తెలుగు, దక్షిణాదితో పాటు నార్త్ ఆడియెన్స్ లోనూ అల్లు అర్జున్ కు గుర్తింపు ఉంది. ఈ క్రేజ్ ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది. ప్రెజెంట్ పుష్ప 2 షూటింగ్ లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *