బాహుబలి రెండు సినిమాలను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ కొంత గ్యాప్ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. ఆక్సీజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాల్లో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో ఆక్సీజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాలు రూపొందనున్నాయి. ఆక్సీజన్ సినిమాకు సిద్దార్థ్ నాదెల్ల, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలకు రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆక్సీజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాల షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తామని నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత ఆర్కా మీడియా నిర్మిస్తున్న సినిమాలు ఇవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *