అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ నటించిన గుడ్ న్యూస్ సినిమా ఐదేళ్ల కిందట రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడీ సినిమా మేకర్స్ బ్యాడ్ న్యూస్ పేరుతో కొత్త సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో వికీ కౌశల్, యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి కీ రోల్స్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ కథకు బ్యాడ్ న్యూస్ కథతో సంబంధం లేదు. ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ ఈ రెండు సినిమాలను నిర్మించాడు.
ఆనంద్ తివారీ దర్శకత్వం వహించాడు. బ్యాడ్ న్యూస్ సినిమా జూలై 19న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇన్ స్టాలో హీరో వికీ కౌశల్ మీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. బ్యాడ్ న్యూస్ సినిమాను జూలై 19న రిలీజ్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశాడు. యానిమల్ తో ఒకరకమైన బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ త్రిప్తి డిమ్రికి ఇదొక మంచి ప్రాజెక్ట్ కానుంది.