స్టార్ హీరోయిన్ తమన్నా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. గతంలో హెబా పటేల్ హీరోయిన్ గా నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఓదెల 2లో తమన్నా లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాను సంపత్ నంది నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఓదెల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన కొన్ని హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా ఆహా ఓటీటీలో రిలీజైంది.

ఇప్పుడు ఓదెల 2ను మరింత గ్రాండ్ స్కేల్ లో నిర్మించనున్నారు. ఇవాళ్టి నుంచి ఓదెల 2 సినిమా షూటింగ్ వారణాసిలో ప్రారంభమైంది. అశోక్ తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాంతార, విరూపాక్ష సినిమాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ హీరోల సరసన నటించే అవకాశాలు తగ్గడంతో తమన్నా ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఆమె చేస్తున్న వెబ్ సిరీస్ లు కూడా పాపులర్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *