చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, కాన్సప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ‘నింగి నుంచి జారే’ పాటని విడుదల చేసి ‘పారిజాత పర్వం’ మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. కంపోజర్ రీ ఈ పాటని క్యాచి మెలోడీగా అద్భుతంగా స్వరపరిచారు. కిట్టు విస్సాప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించిన ఈ పాటని హరి చరణ్, లిప్సిక చాలా ప్లజెంట్ గా ఆలపించారు. ఈ పాటలో చైతన్య రావు, మాళవిక సతీశన్ కెమిస్ట్రీ మెస్మరైజింగా వుంది.

బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. సశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.

తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *