స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు. ప్రస్తుతం తమిళనాడును అతలాకుతలం చేస్తున్న మిగ్ జౌం తుఫాన్ బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు. సూర్య, కార్తి 10 లక్షల రూపాయల వరద సాయం అనౌన్స్ చేశారు. ఇది ఇన్సియల్ డొనేషన్ మాత్రమేనని, త్వరలో మరికొంత సాయాన్ని కూడా ప్రకటిస్తామని వారు తెలిపారు.
ఈ విషయాన్ని సూర్య, కార్తి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ కాజ్ కోసం తమ హీరోలు ఎప్పుడూ ముందుంటారని వారు పోస్టులు చేస్తున్నారు. వరదలతో దెబ్బతిన్న చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూర్ ప్రాంతాలకు ఈ వరద సాయాన్ని ఉపయోగించబోతున్నారు. తమిళనాడు మాత్రమే కాదు తెలంగాణ, ఏపీలో ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొస్తుంటారు సూర్య, కార్తి.