తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. వాళ్ల మదర్ మాధవితో కలిసి జుబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, యూత్ ఓటు వేసేందుకు బయటకు రావాలని విజయ్ పిలుపునిచ్చారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – పదేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగింది. మనం ఓటు ద్వారా మంచి లీడర్స్ ను ఎన్నుకోవడం వల్లే ఈ డెవలప్ మెంట్ చూస్తున్నాం. ఓటు ఎవరికి వేయాలి అనేది ప్రజల ఇష్టం. అయితే ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. నేను అందుకే మా ఫ్యామిలీతో కలిసి ఓటింగ్ కు వచ్చాను. ప్రభుత్వం హాలీడే ఇచ్చింది కూడా ఓటు వేయాలనే. యువత కూడా తమ ఓటును వేయాలి. అన్నారు.