కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా ఇవాల్టి నుంచే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. రూల్స్ రంజన్ సినిమాను దర్శకుడు రత్నం కృష్ణ రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ట్రైలర్ తో అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది రూల్స్ రంజన్ మూవీ. అయితే థియేటర్స్ లో ఈ క్రేజ్ మేరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సక్సెస్ లేని కిరణ్ అబ్బవరంకు హిట్ ఇస్తుందని అనుకున్న రూల్స్ రంజన్ సినిమా నిరాశపర్చింది. ఓటీటీకి బాగా యాప్ట్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. దాంతో డిజిటల్ గా మంచి రెస్పాన్స్ వస్తుందని రూల్స్ రంజన్ టీమ్ ఆశిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *