తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే మూవీ స్టార్స్ తమ ఓటు హక్కు ఉన్న పోలింగ్ స్టేషన్స్ దగ్గరకు వెళ్లి ఓటు వేశారు.
జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులు రామ్ చరణ్, సురేఖ, కూతురు శ్రీజతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. జుబ్లీహిల్స్ లో హీరో అల్లు అర్జున్, ఎస్ఆర్ నగర్లో నటుడు ప్రకాష్ రాజ్, జుబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, మణికొండలో దగ్గుబాటి వెంకటేష్ ఓటు వేశారు. జుబ్లీహిల్స్ ప్రభుత్వ మహిళా హాస్టల్ లో నాగార్జున, నాగ చైతన్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.