తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థ ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ మూవీస్ చేస్తోంది. త్వరలో కోలీవుడ్ లోనూ ప్రాజెక్ట్స్ చేయబోతోంది. హీరో అజిత్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు ఒకరు డైరెక్షన్ చేస్తారని టాక్ వినిపించినా..అందులో నిజం లేదని అంటున్నారు.
తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అజిత్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబో సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా కూడా కన్ఫర్మ్ చేస్తోంది. అధిక్ రవిచంద్రన్ రీసెంట్ గా విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ అనే సినిమాను రూపొందించారు. ఇది తెలుగులోనూ రిలీజైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కోలీవుడ్ లోనూ అక్కడి స్టార్స్ తో సినిమాలు ప్లాన్ చేస్తోంది.