డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన లేటెస్ట్ ఫిల్మ్ కీడా కోలా ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఓహా ఓటీటీ డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిఉంది. నవంబర్ 3న థియేటర్స్ లోకి కీడా కోలా వచ్చింది. ఈ సినిమా క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఓ మోస్తరు సక్సెస్ అందుకుంది.

సినిమా సూపర్ హిట్టైతే తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కు కదిలే పరిస్థితి లేని నేపథ్యంలో కీడా కోలా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే సక్సెస్ లేని దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కీడా కోలాకు వచ్చిన రెస్పాన్స్ సంతోషాన్నే ఇచ్చి ఉంటుంది. చైతన్య రావ్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్ తదితరులు కీరోల్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *