అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మిషన్ రాణిగంజ్ సినిమా ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మిషన్ రాణిగంజ్ సినిమాను దర్శకుడు టిను దేశాయ్ రూపొందించారు. పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 6న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లలో వెనకబడింది.

అయితే ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. మిషన్ రాణిగంజ్ ను వచ్చే ఆస్కార్ కోసం ఇండిపెండెంట్ కేటగిరీలో పంపించారు. పశ్చిమ బెంగాల్ లోని రాణిగంజ్ బొగ్గు గని ప్రమాదంలో 65మంది కార్మికులను కాపాడిన సేప్టీ ఆఫీసర్ క్యాప్యూల్ గిల్ సాహసం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తన ప్రాణాలకు తెగించి కార్మికుల ప్రాణాలు కాపాడిన కోల్ మైన్స్ అధికారి గిల్ గొప్పదనం ఈ సినిమాతో తెరపైకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *