కోలీవుడ్ హీరో కార్తి తన కొత్త సినిమా జపాన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా భారీ విరాళం అందించారు. తన వంతుగా 1.25 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్బును సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. జపాన్ కార్తి నటించిన 25వ సినిమా కావడం విశేషం. ఈ స్పెషల్ అకేషన్ సందర్భంగా కార్తి ఈ విరాళం ఇచ్చినట్లు ప్రకటించారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు రాజు మురుగున్ జపాన్ సినిమాను రూపొందిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా జపాన్ రూపొందింది. ఈ దీపా‌‌వళికి తమిళంతో పాటు తెలుగులోనూ జపాన్ రిలీజ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *