ఈ ఏడాది టాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా.
నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ సినిమా హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నవీన్, అనుష్క నటనకు ప్రశంసలు దక్కాయి.
యూఎస్ లో దాదాపు 2 మిలియన్ కు చేరువైన ఈ సినిమా ఓవరాల్ గా 50 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ వద్ద వసూళు చేసింది. ఈ సక్సెస్ ఫుల్ మూవీ లేటెస్ట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 5వ తేదీ నుంచి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ లో మరింత మందికి చేరువయ్యే అవకాశముంది. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే అంశంలో కొత్త పాయింట్ టచ్ చేస్తూ వెళ్లిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఓటీటీకి మరింత యాప్ట్ అయ్యే మూవీ కాబట్టి డిజిటల్ వేదిక మీద కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశముంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు పి.మహేశ్ బాబు ఈ సినిమాను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *