Vani Jayaram

Vani Jayaram: సింగర్ వాణి జయరాం ఫిబ్రవరి 4 చెన్నై లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె భర్త జయరాం 2018లో చనిపోవడంతో అప్పటినుండి వాణి జయరాం ఒంటరిగానే ఉంటుంది.ఇక ఈమెకు ఇంట్లో చేదోడు వాదోడుగా పరిమనిషి ఉండేది. ఎప్పటిలాగే ఆరోజు పనిమనిషి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా అస్సలు డోర్ తీయలేదు. దీంతో కంగారుపడ్డ పనిమనిషి వాణి జయరాం సోదరికి ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసింది.వెంటనే ఈ విషయం తెలుసుకొని వాణీ జయరాం సోదరి ఇంటి దగ్గరికి వచ్చి డూప్లికేట్ కీ తో డోర్ తీసి ఇంట్లోకి వెళ్లి చూడగానే వాణి జయరాం తన బెడ్ రూమ్లో రక్తపు మడుగుల్లో అచేతనంగా పడి ఉంది.

హాస్పిటల్ కి తరలించాక చనిపోయింది అని చెప్పుకొచ్చారు. అయితే ఆమె తలపై గాయం అవడంతో చాలామంది ఆమెను హత్య చేశారా లేక ఆమెనే కాలుజారి పడిపోయిందా అనే అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే పోస్టుమార్టం నిర్వహించగా వాణిజయరాం (Vani Jayaram) పోస్టుమార్టం లో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వాణి జయరాం గత ఐదు సంవత్సరాలుగా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో కాస్త అనారోగ్యంగా ఉండడం వల్ల ఇంట్లో నుండి ఎక్కువగా బయటకు రావడం లేదు.

ఇదే నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో వాణీ జయరాం (Vani Jayaram) మృతి చెందడంతో చాలామందిలో అనుమానాలు తలెత్తాయి. ఇక పోస్టుమార్టం నిర్వహించాక ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది. వాణిజయరాం ఇంట్లో సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. వాణి జయరాం తన బెడ్ రూమ్ లోని రెండు ఫీట్ల టేబుల్ పై పడిపోయేసరికి ఆమె తలకు బలమైన గాయమైందట.

గాయమైన టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె అలాగే పడిపోయింది.అలాగే టేబుల్ పై కూడా రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఇంట్లో ఎవరు లేనందు వల్ల వాని జయరాం (Vani Jayaram) కు కరెక్ట్ టైం లో ట్రీట్మెంట్ అందలేదు.దీంతో ఆమె మరణించింది. ఇక ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణమే అని పోలీసులు స్పష్టం చేశారు. అధికారిక లాంఛనాలతో వాణిజయరాం అంత్యక్రియలు నిర్వహించింది తమిళనాడు ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *