Vani Jayaram: అలనాటి మేటి సింగర్.. ప్రముఖ నేపథ్య గాయని… వాణి జయరాం శనివారం రోజు మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె మరణ వార్త విని ఇప్పటికే చాలామంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాణి జయరాం దాదాపు 20 వేలకు పైగా పాటలు పాడింది.ఇదిలా ఉంటే ఈమెది సహజ మరణం కాదు.. అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఈమెను హత్య చేశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.మరి ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింగర్ వాణి జయరాం (Vani Jayaram) 77 ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఈమె మృతిపై చాలామంది అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఆమె చనిపోయే టైంకి ఆమె మొహంపై గాయాలు ఉండి రక్తపు మడుగుల్లో అచేతన స్థితిలో పడిపోయి ఉండటం. ఈ కారణంగా ఈమె మృతిపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వాణి జయరాం ఇంట్లో ఎన్నో రోజుల నుండి పనిమనిషిగా చేస్తున్న ఆ వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం.. పనిమనిషి ఎప్పటిలాగే వాణి జయరాం ఇంటికి పనిచేయడానికి వచ్చిందట.
అయితే ఆ టైం కి ఎంతసేపు డోర్ కొట్టినా కూడా వాణి జయరాం స్పందించకపోవడంతో భయపడిపోయి పనిమనిషి వాణి జయరాం బంధువులకు ఫోన్ చేసిందట. ఇక వాణి జయరాం (Vani Jayaram) సోదరి వచ్చి డూప్లికేట్ కీ తో డోర్ తెరిచి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి వాణి జయరాం తన బెడ్రూంలో మొహంపై గాయాలతో రక్తపు మడుగుల్లో పడి ఉందట. అప్పటికే ఆమె మరణించింది.దాంతో పోలీసులకు ఆమె సోదరి ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వాణి జయరాం పిల్లలు లేకపోవడంతో ఆమె భర్త చనిపోయినప్పటి నుండి ఒంటరిగానే ఉంటుంది.
తనకి చేదోడు వాదోడుగా పనిమనిషి ఉంటుంది. అయితే మొహంపై గాయాలు ఉండడంతో చాలామంది ఆమెది సహజ మరణమేనా? లేక హత్య చేశారా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వాణి జయరామ్ (Vani Jayaram) ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అన్వేషించారు.వాణి జయరాం భౌతిక దేహానికి పోస్టుమార్టం నిర్వహించాక ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ఏమని వస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఇక రిపోర్ట్ లో ఆమెను హత్య చేశారా లేక సహజ మరణమా అనేది తెలియాల్సి ఉంది.