Vani Jayaram.. ప్రముఖ గాయని వాణీ జయరాం (Vani Jayaram) శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో అనుమానాదస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు చెన్నైలోని ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాణీ జయరాం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం అయినట్లు గుర్తించారు. అయితే ఈ గాయం పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని పోలీసులు కూడా చెబుతున్నారు.
పోస్టుమార్టం అయితే జరిగింది కానీ రిపోర్టులు వచ్చేవరకు స్పష్టత ఇవ్వలేము అని.. అంతవరకు వేచి ఉండాల్సిందే అంటూ కూడా మీడియాతో పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని వాణి జయరాం నివసించే అపార్ట్మెంట్ కి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె అంతక్రియలు నిర్వహించబోతున్నారు. పోస్టుమార్టం లో ఏం రాబోతుంది అనేది ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
నిజానికి వాణీ జయరామ్ భర్త జయరామ్ 2018 లోనే మరణించారు. పైగా పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఒంటరిగానే చెన్నైలోనే ఒక అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ఆమెకు తోడుగా ఒక పనిమనిషి ఉండేది.ఆమె వంట, ఇంటి పనులతో పాటు వాణి జయరామ్ కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకునేది. ఎప్పటిలాగే పని పూర్తవుగానే తన ఇంటికి వెళ్ళిపోయేది. అయితే ఈసారి కూడా పని ముగించుకొని ఇంటికి వెళ్లిన పనిమనిషి మరుసటి రోజు శనివారం ఉదయం వాణి జయరామ్ ఉంటున్న అపార్ట్మెంట్ గది తలుపు కాలింగ్ బెల్ ఎన్నిసార్లు కొట్టిన తీయకపోయేసరికి అనుమానం వచ్చి చెన్నైలోనే పనిచేయడం బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన చేరుకున్న పోలీసులు వాణి జయరామ్ ఉంటున్న గది తలుపులు బద్దలు కొట్టి లోపల వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉండడం అందరికీ అనుమానాన్ని కలిగిస్తోంది అయితే ఆమెను ఎవరు కొట్టి చంపి ఉంటారో అనేది ఇప్పుడు మరింత వైరల్ గా మారుతోంది.