Vani Jayaram: ఇటీవల కాలంలో చాలామంది సినీ దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరు ఈలోకాన్ని విడిచిపెట్టివెళ్తున్నారు. వారి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు మరణించి 24 గంటలు కూడా గడవకముందే యావత్ భారత దేశ చరిత్రలోనే స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకున్న సింగర్ వాణి జయరాం కన్నుమూయడం నిజంగా బాధాకరం. వాణి జయరాం 1970లో తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. 1970లో మొదలైన ఈమె సినీ ప్రయాణంలో దాదాపు పదివేలకు పైగా పాటలు పాడింది.
అంతేకాదు ఈమె 18 భాషల్లో పాటలు పాడింది. వాణి జయరాం (Vani Jayaram) తెలుగు సినిమా ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం అవడం కంటే ముందే బాలీవుడ్ లో స్టార్ సింగర్. బాలీవుడ్ లో తన సత్తాచాటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టింది. తెలుగులో కూడా దాదాపు 1000 కి పైగా పాటలు పాడింది. మరీ ముఖ్యంగా కళాతపస్వి కే.విశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో వాణి జయరాం పాటలు పాడింది. తెలుగులో ఆమె పాడిన ప్రతిపాట మ్యూజికల్ బ్లాక్బస్టర్ హిట్టే.ఈమె ఎలాంటి పాటలు అయినా అలవోకగా పాడేస్తోంది.
తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిస్సా,అస్సామీ ఇలా చెప్పకుంటూ పోతే 18 భాషల్లో వాణీ జయరాం తన మధురమైన గొంతుతో పాటలు పాడి స్టార్ సింగర్ గా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. సింగర్ వాణి ఇండస్ట్రీ లోకి వచ్చిన తొలి నాళ్ళలోనే జయరాం (Jayaram) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆయన 2018లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. అయితే వీరికి పిల్లలు లేరు. గత కొన్ని నెలలుగా వాణిజయరాం చెన్నైలోనే నివాసం ఉంటుంది.
ఇక ఉన్నట్టుండి ఆమె హఠాత్మరణం పొందడంతో చాలామంది బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే వాణీ జయరాం (Vani Jayaram) చివరి కోరిక తీరకుండానే చనిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె చివరి కోరిక ఏంటంటే.. ఇప్పటికే వాణి జయరాం కి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది.కానీ ఆ అవార్డును తన చేతులతో అందుకోక ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి చాలామంది ఆమె అభిమానులు చివరి కోరిక తీరకుండానే చనిపోయారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.