PriyamaniPriyamani.. తెలుగు , తమిళ్ భాషా చిత్రాలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియమణి (Priyamani) తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన యమదొంగ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ రేంజ్ కు మాత్రం ఎదగలేక పోయింది. దాంతో సినిమాలకు కొంతకాలం దూరమైన ఈమె తాను ప్రేమించిన ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ముస్తఫా రాజ్ కు ఇదివరకే వివాహమైన విషయం తెలిసిందే. అయినా కూడా తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది ప్రియమణి.

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియమణి మరో రేవతి (Revathi) కానుంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రియమణి , ముస్తఫా రాజ్ (Mustafa Raj) ల పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లలు మాత్రం కలగలేదు. ముస్తఫాకు పిల్లలు కావాలని కోరిక ఉన్నప్పటికీ ప్రియమణి మాత్రం ఇప్పుడు పిల్లలు వద్దు అని చెబుతోందట . నిజానికి సినిమాలలో.. మరోవైపు వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్న ప్రియమణి ఇప్పుడు పిల్లలు అంటూ సినిమా కెరియర్ పై దృష్టి సారించకపోతే.. తన బాడీ ఫిజిక్ మారిపోతుంది అని, పిల్లలు కలిగిన తర్వాత సినిమాలలో అవకాశాలు రావని అందుకే ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.

గతంలో ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రేవతి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే నాటకాల నుండి సినిమాలలోకి ప్రవేశించి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ గొప్ప పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంది. ఇక కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన సురేష్ చంద్ర మీనన్ ను వివాహం చేసుకుంది. అయితే పిల్లలు కనాలి అంటే సినిమా కెరియర్ నాశనం అవుతుంది అని ఆలోచించిన రేవతి కూడా పిల్లలకు దూరం అయింది.

ప్రియమణి కూడా సినిమాల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకోబోతోంది.. అందుకే మరో రేవతి కాబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని ప్రియమణి తల్లి అయితే చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *