ఒకప్పటి స్టార్ హీరోయిన్, నేటి వైసీపీ మంత్రి రోజా ఒక ముఖాముఖీ సంభాషణలో మెగాస్టార్ చిరంజీవి గుర్చి చెప్పిన విషయాలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నాకు సినిమాలు మరియు రాజకీయాలు రెండు కళ్లు అని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఎక్కడ ఉన్నా ప్రజలతో నే మరియు ప్రజల మధ్యే ఉంటున్నానని రోజా అన్నారు.కాలేజ్ లో ఉన్న టైం లో నేను నటీగా రైమింగ్స్, టైమింగ్స్ తో మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టమని రోజా వెల్లడించారు.రాజకీయాలు అంటే మనం ఎంత కష్టపడినా విరోధులు ఎక్కువగానే ఉంటారని, మనం ఎంత సేవ చేసినా నెగిటివ్ గా చాలామంది కామెంట్లు చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

నన్ను తిట్టిన వాళ్లు అంతా నా శత్రువులు అని అనుకోనటం లేదు అని కూడా అన్నారు.చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వచ్చిన టైంలో నేను వేరే పార్టీలో ఉండటం వల్ల ఆయన మీద కూడా విమర్శలు చేయాల్సి వచ్చిందని రోజా కామెంట్లు చేశారు.పాలిటిక్స్ లకు చిరంజీవి గారు అంతగా సూట్ అవ్వరని నేను ఎప్పుడో చెప్యా కానీ దానికి అందరు నన్ను చూసి నవ్వారు.చిరంజీవి గారు చాలా సెన్సిటివ్ అనే విషయం నాకు బాగా తెలుసని రోజా అన్నారు.

ఐతే అప్పట్లో చిరంజీవి గారిపై నేను విమర్శలు చేయడం నన్ను ఎంతగానో బాధ పెట్టిందని రోజా పేర్కొన్నారు.ఐనా అది ఆయన కూడా పర్సనల్ గా తీసుకోలేదు అలాగే నేను కూడా తీసుకోలేదని కూడా చెప్పారు. నేను చిరంజీవి గారిని ఒక సిట్యువేషన్ లో కలవగా నేను తిట్టినా ఆయనకు కోపం రాలేదని చెప్పారని రోజా చెప్పుకొచ్చారు.

దానికి ఆయన ఒక ఆర్టిస్ట్ గా, ఫ్యామిలీ ఫ్రెండ్ గా నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో నాకు తెలుసు అని చిరంజీవి గారు అన్నారని కూడా రోజా చెప్పారు.రోజా పాలిటిక్స్ లో ప్రెసెంట్ ఫుల్ బిజీ గా ఉన్నారు.ఐతే రోజా మూవీస్ లకు దాదాపుగా దూరమైనట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.ఐతే రోజా చెప్పిన ఈ విషయాలుఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *