పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్లు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏమాత్రం సందర్భం దొరికినా.. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తున్నారు. దారుణంగా విమర్శిస్తున్నారు. బ్రో మూవీలో శ్యామ్ బాబు క్యారెక్టర్ పెట్టడం.. దీని పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఫైర్ అవ్వడంతో వివాదస్పదం అయ్యింది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ ఓ వీడియో రూపంలో తన మనసులో మాటలను బయటపెట్టింది.

ఇంతకీ ఈ వీడియోలో రేణు దేశాయ్ ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్‌ అరుదైన వ్యక్తి. ఆయన సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి వెబ్ సిరీస్ తీస్తామని అన్నారు. నా మాజీ భర్త నా విషయంలో చేసింది ముమ్మాటికీ తప్పే కానీ.. దానికి, ఆయన రాజకీయాలకు సంబంధం లేదు. ప్రజలకు మంచి చెయ్యాలనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకి డబ్బు యావ లేదు. రాజకీయంగా మీరు విమర్శలు చేసుకోండి. ఆ గొడవల్లోకి పిల్లలను లాగకండి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి.

నా పిల్లలనే కాదు, ఎవరి పిల్లలను వాటిల్లోకి లాగకండి. వాళ్లు ఇంకా చిన్న పిల్లలే. ఒక తల్లిగా అభ్యర్థన ఇది. పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు అన్నారు. రేణు దేశాయ్ ఇలా వీడియో రిలీజ్ చేయడం.. అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. రానున్న ఎన్నికల నేపధ్యంలో ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *