C. KalyanC. Kalyan..తెలుగు నిర్మాతల మండలి లో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నట్లు అధ్యక్షులు సినీ నిర్మాత సీ. కళ్యాణ్ ప్రకటించారు. నిర్మాతల మండలి ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూనే.. ఆయన ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే సి కళ్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతల మండలకి గొప్ప చరిత్ర ఉంది.. అదెప్పుడు బాగుండాలని మేము కోరుకుంటాము. టీఎఫ్పీసీ కమిటీ పై కావాలని కొంతమంది సోషల్ మీడియాలో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము.

ముఖ్యంగా నిర్మాతలు కే సురేష్ బాబుని మూడేళ్లు.. ఎలమంచిలి రవి చంద్ ను జీవితకాలం నిర్మాతల మండలి నుంచి బహిష్కరించాము అని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే నిర్మాతల మండల కి చెడ్డపేరు తేవాలని ఎవరు ప్రయత్నించినా సరే వదిలేది లేదు అని హెచ్చరించారు. ముఖ్యంగా కొంతమంది మండలిలో ఎన్నికలు జరగట్లేదు అని రాద్ధాంతం చేస్తున్నారు. కానీ వచ్చే నెల 19వ తేదీన నిర్మాతల మండలకి ఎన్నికలు జరుగుతాయి అని తెలిపారు.

అలాగే ఆంధ్రాలో ఇండస్ట్రీ విషయంపై మాట్లాడుతూ.. నేను గతంలోనే చెప్పాను.. అప్పుడు చాలామంది నన్ను కామెంట్ చేశారు. ఆంధ్రకి సినిమా ఫీల్డ్ రాదని చెప్పావ్ ఏంటి అన్నారు.. 100% అదే నిజం.. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారా ? మద్రాస్ నుండి ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం? గవర్నమెంట్ తెచ్చిన కొత్త జీవో ప్రకారం ఒక సినిమా తీసాను. అదే “RDX లవ్”.. ఫుల్ సినిమా ఆంధ్రాలోనే తీస్తే రూ.3 కోట్లు ఎక్స్ట్రా అయ్యింది. ఆంధ్ర నుండి నిర్మాతలకు ఏ బెనిఫిట్స్ లేవు. పాత రోజుల్లో అయితే సబ్సిడీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీలు కూడా లేవు.

మాకు ఇంకా పాత గవర్నమెంటు ఇవ్వాల్సిన సబ్సిడీ లే రాలేదు. సినిమా ఫీల్డ్ ని పాలిటిక్స్లో థింక్ చేయకండి.. వీలైనంత త్వరగా ఆంధ్రలో నంది .. తెలంగాణలో సింహ అవార్డులను ప్రధానం చేయాలని.. ఆయా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *